రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌గెహ్లాట్‌

- December 13, 2018 , by Maagulf
రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌గెహ్లాట్‌

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌గెహ్లాట్‌ను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయ. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పలువురు సీనియర్‌ నేతలు నేడు సమావేశమైన సంగతి తెలిసిందే. తొలుత రాహుల్‌తో సమావేశమైన రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌పైలెట్‌ ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించినట్లు సమాచారం. దీంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించిన అశోక్‌గెహ్లాట్‌ను మరోసారి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారని, అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com