శంషాబాద్‌ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం

- December 14, 2018 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం

శంషాబాద్‌ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పలువురు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.

సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రయాణికుల పాస్‌పోర్టులు, వీసాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తారు. అయితే.. ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొందరు సిబ్బంది నకిలీ వీసాలతో చెక్కేసేవారితో కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారు. ఎయిర్‌లైన్స్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com