ఘోరం..గుడిలో ప్రసాదం తిని 5 మంది మృతి..
- December 14, 2018కర్నాటక:కర్నాటకలో ఘోరం చోటు చేసుకుంది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగాళ గ్రామంలోని మారమ్మ గుడిలో ప్రసాదం తిని 5 మంది చనిపోయారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మైసూర్లోని ఆస్పత్రిలో మరో 50 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇంత ఘోరం జరగడానికి ఫుడ్ పాయిజన్ అవడం కారణం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసాదంలో విష గుళికలు కలిశాయని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. అందుకే.. ఇంత పెద్ద ఘోరం జరిగిందని చెప్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించారు.
కర్నాటకలో 5 మంది భక్తుల ప్రాణాలు తీసిన పాపం ఎవ్వరిది? ఈ విషయంలో దృష్టి సారించిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. కొన్నాళ్లుగా స్థానికులకు, ఆలయ పూజారికి మధ్య వివాదం నడుస్తున్నట్టు బయటపడింది. ఈనేపథ్యంలో ప్రసాదంలో ఎవరో విషం కలిపి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!