ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది

- December 18, 2018 , by Maagulf
ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది

ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది... తొలిరౌండ్ ముగిసేసరికి ఈ సారి వేలంలో

- పేసర్‌ ఉనాద్కట్‌ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. 
- ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. 
- ఇక వెస్టిండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్‌ను రూ.5కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. 
- వెస్టిండీస్ జట్టుకు చెందిన మరో ఆటగాడు హెట్‌మైర్‌ను రూ.4.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. 
- హనుమ విహారిని ఢిల్లీ జట్టు రూ.2కోట్లకు, అక్సర్ పటేల్‌ను రూ.5కోట్లకు సొంతం చేసుకుంది. 
- మలింగను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి. 
- హెన్రిక్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది. - ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది. 
- వికెట్ కీపర్ సాహాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. 
- విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది. 
- షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా... మోహిత్ శర్మను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
- ప్రస్తుతం ఐపీఎల్ 2019 వేలం పాట కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com