హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్

- December 19, 2018 , by Maagulf
హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్

హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాయదుర్గంలోని తన ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించడంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. రాయదుర్గం పాన్ మక్తాలో 46 సర్వేనెంబర్‌ 84 ఎకరాల స్థలం ఉంది. అది ప్రభుత్వానికి చెందిన భూమిగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. నందిని హిల్స్‌లోని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభాస్ ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో గేటుకు నోటీసులు అంటించారు. దీనిపై ప్రభాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ ఇవాళే విచారణకు రానుంది.

 

హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్

రాయదుర్గంలోని తన ఇంటిని సీజ్‌ చేయడంపై పిటిషన్
సర్వే నెం.46లోని 84 ఎకరాలు ప్రభుత్వ స్థలంగా సుప్రీంకోర్టు తీర్పు
నందిని హిల్స్‌లోని నిర్మాణాలకు నోటీసులు అంటించిన అధికారులు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టుకు వెళ్లిన ప్రభాస్
ప్రభాస్ పిటిషన్‌ను ఇవాళ విచారించనున్న హైకోర్టు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com