అనూహ్య హత్య కేసులో బాంబే కోర్టు సంచలన తీర్పు

- December 21, 2018 , by Maagulf
అనూహ్య హత్య కేసులో బాంబే కోర్టు సంచలన తీర్పు

మచిలీపట్నానికి చెందిన టెక్కీ అనూహ్య ఎస్తర్‌ హత్య కేసులో బాంబే కోర్టు సంచనల తీర్పు చెప్పింది. ట్యాక్సీడ్రైవర్‌ చంద్రబాన్‌ను హంతకుడిగా న్యాయస్థానం నిర్ధారించింది. అతడికి మరణశిక్షను విధించింది.

2015లో అనూహ్య హత్యకు గురైంది. ముంబై రైల్వే స్టేషన్‌లో దిగిన ఆమెను.. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే చంద్రబాన్ ట్రాప్ చేశాడు. అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రజా సంఘాలు రోడ్డెక్కడంతో ముంబై పోలీసులు ప్రతిష్టగా తీసుకుని కేసును ఛేదించారు. వేగంగా విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాన్‌కు మరణ శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com