సెన్సార్ పూర్తి చేసుకున్న 'పేట్టా' చిత్రం

- December 24, 2018 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న 'పేట్టా' చిత్రం

'పేట్టా' చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాను చూసిన తరువాత అధికారులు, కొన్ని పోరాట దృశ్యాలను మార్చితే, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, అందుకు చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ అంగీకరించలేదని, దీంతో ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తో తొలిసారిగా సిమ్రాన్, త్రిష నటించారు. కాగా విజయ్ సేతుపతి, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్ ఉందని, దాని కారణంగానే 'యూ/ఏ' ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com