మళయాలంలో డైరెక్టర్ నీలకంఠ

- December 24, 2018 , by Maagulf
మళయాలంలో డైరెక్టర్ నీలకంఠ

బాలీవుడ్‌ లో క్వీన్‌ మూవీతో తిరుగులేని స్టార్డమ్‌ తెచ్చుకున్న భామ కంగనా రనౌత్‌. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ స్టోరీగా వచ్చిన క్వీన్‌ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌ గానూ అతిపెద్ద విజయం సాధించింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మళయాలంలో 'జామ్‌ జామ్‌' పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మంజిమా మోహన్‌ కథానాయిక.
కేవలం మలయాళ వెర్షన్‌కు మాత్రమే మన తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించారు. తెలుగులో షో సినిమాతో జాతీయ అవార్డ్‌ అందుకున్న నీలకంఠ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ఇక రీసెంట్‌ గా ఈ రీమేక్‌ కు సంబంధించిన నాలుగు భాషల టీజర్స్‌ విడుదలయ్యాయి. మళయాల వెర్షన్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. రీమేక్‌ అయినా అత్యంత సహజంగా కేరళ నేచురాలిటీకి దగ్గరగా రూపొందుతోంది. మీడియెంట్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో మంజిమా మోహన్‌తో పాటు సన్నీవేన్‌, షిబానీ దండేకర్‌, బాయిజు, ముత్తుమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com