శమరిమల ఆలయం మూసివేత..

- December 26, 2018 , by Maagulf
శమరిమల ఆలయం మూసివేత..

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఇవాళ అయ్యప్పస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గత నెల 15వ తేదీ నుంచి మండల పూజలు ప్రారంభం కాగా... 41వ రోజైన ఇవాళ రాత్రి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఇక మకరవిళక్కు సందర్భంగా ఈ నెల 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరుస్తారు పూజారులు... అదే రోజున ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, వండిపెరియార్ నుంచి పులిమేడు దారుల్లో భక్తులకు అనుమతిస్తారు. ఇక జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో అన్ని వయస్సుల మహిళలకు అయ్యప్పదర్శనం కలిపించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రవేశానికి మహిళలు యత్నించడం... కొందరు భక్తులు అడ్డుకోవడం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com