రెండుగా చీలనున్న ఆర్ఆర్ఆర్ !?
- December 28, 2018'ఆర్ ఆర్ ఆర్' రెండవ షెడ్యూల్ కు రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఒకవైపు కార్తికేయ పెళ్లి వ్యవహారాలను చూసుకుంటూనే మరొకవైపు త్వరలో ప్రారంభం కాబోతున్న 'ఆర్ ఆర్ ఆర్' రెండవ షెడ్యూల్ లో తీయవలసిన సీన్స్ కోసం రాజమౌళి తన టీమ్ మెంబర్స్ తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథ 1930 నుండి 2019 వరకు కొనసాగుతుంది కాబట్టి అనేక ట్విస్ట్ లు ఈకథలో ఉండబోతున్నాయి. దీనితో ఈమూవీ కథకు సంబంధించిన ట్విస్ట్ లలో క్లారిటీ లోపించకుండా అవసరం అనుకుంటే ఈమూవీని కూడ రెండు భాగాలుగా తీయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు టాక్.
ఇప్పటికే ఈ విషయమై రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 'బాహుబలి' రెండు పార్ట్ లలో తీసిన సందర్భంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ట్విస్ట్ ఉన్నట్లుగా 'ఆర్ ఆర్ ఆర్' కథకు సంబంధించి కూడ ప్రేక్షకులను విపరీతంగా ఆలోచింప చేసే ఒక ట్విస్ట్ దొరికితే ఈమూవీని కూడ రెండు పార్ట్స్ గా తీయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు.
దీనికితోడు ఈమూవీని రెండు పార్ట్స్ గా తీయడం వల్ల లాభాలు కూడ విపరీతంగా వస్తాయని అందువల్ల ఈమూవీకి అనుకోకుండా బడ్జెట్ పెరిగినా ఎటువంటి నష్టం ఉండదు అన్న కోణంలో రాజమౌళి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ముగిసేలోగా ఈవిషయం పై ఒక నిర్ణయానికి రావాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే జూనియర్ చరణ్ లు రెండు సంవత్సరాల పాటు రాజమౌళి బంధిఖానాలో ఉండి పోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..
తాజా వార్తలు
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..