ఆంటీ అంటూ నన్ను ఎవరైనా పిలిస్తే…షూట్ చేయండి: స్మ్రుతి ఇరానీ
- December 28, 2018ప్రస్తుత కాలంలో చాలామంది యువతులకైనా, యువకులకైనా ఎంత వయసు పెరిగినా కూడా ఆంటీ, అంకుల్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తనకు కూడా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టముండదు అంటూ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఎయిర్ పోర్టులో అనుకోకుండా స్మృతి ఇరానీ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిశారట. దీంతో ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారట. 'జాన్వీ కపూర్ నన్ను ఆంటీ అని సంబోధిస్తూ మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నాక ఆంటీ అని పిలిచినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు నేనేం ఫర్వాలేదు అంటూ సర్ది చెప్పాను. ఈ కాలం పిల్లలు ఉన్నారే… ఆంటీ అంటూ ఎవరైనా పిలిస్తే… ఎవరైనా నన్ను షూట్ చేయండి అని గట్టిగా అరవాలన్పిస్తుంది…' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు స్మృతీ ఇరానీ. ప్రస్తుతం ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో, 'తక్త్' అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు