ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
- January 02, 2019'బాహుబలి' తర్వాత ప్రభాస్.. ఆ రేంజ్ సినిమాలే ప్లాన్ చేసుకొంటున్నారు. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో 'సాహో' తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక, రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం కూడా భారీ బడ్జెట్ సినిమాయే. ఈ సినిమాని బాహుబలి రేంజ్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత కూడా ప్రభాస్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఇటీవల ప్రశాంత్ నీల్ వెళ్లి ప్రభాస్ తో ఓ క్యాజువల్ భేటీ వేశారు. దానివెనుక దిల్ రాజు వున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ కనుక మాంచి సబ్జెక్ట్ తో ప్రభాస్ ను ఒప్పించగలిగితే, ఎంతయినా పెట్టి ప్రొడక్షన్ చేసేందుకు దిల్ రాజు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభాస్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రావడం ఖాయం.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ