15 మిలియన్ దిర్హామ్ల లాటరీ: ప్రాంక్ కాల్ అనుకున్నానంటోన్న ఇండియన్
- January 03, 201915 మిలియన్ దిర్హామ్ల లాటరీని బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గెల్చుకున్న ఇండియన్, తాను ఇంకా ఈ వాస్తవాన్ని నిజమని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. శరత్ పురుషోత్తమన్ అనే భారత వలసదారుడు, బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద మొత్తమైన 15 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న సంగతి తెల్సిందే. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో ఈ డ్రా నిర్వహించారు. విజేతకు పలుమార్లు ఫోన్ చేశామనీ, అయితే అది నిజమని ఆయన తొలుత నమ్మలేదని బిగ్ టికెట్ అబుదాబీ డ్యూటీ ఫ్రీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షెరిల్ ఫజార్డో చెప్పారు. 083733 నెంబర్ టిక్కెట్పై ఈ బహుమతి పురుషోత్తమన్ని వరించింది. గెలిచిన విషయాన్ని తెలియజేయడం జరిగిందనీ, అయితే అది నిజమని ఒప్పించడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు అన్నారు. కాగా, రెండో ప్రైజ్ 100,000 దిర్హామ్లు కూడా భారతదేశానికి చెందిన వ్యక్తి జినాచంద్రన్ వజూర్ నారాయణన్ గెల్చుకోవడం గమనార్హం. పాకిస్తాన్కి చెందిన షాహిద్ ఫరీద్ మూడో బహుమతి గెలుచుకున్నారు. మొత్తంగా ఈ డ్రాలో 8 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్