15 మిలియన్ దిర్హామ్ల విజేతలు ఈ బెస్ట్ ఫ్రెండ్స్
- January 04, 2019యూ.ఏ.ఈ:ఇద్దరు స్నేహితులు.. కొత్త ఏడాదిలో అత్యద్భుతమైన బహుమతిని గెల్చుకున్నారు. ఈ ఆనంద క్షణాల్ని పంచుకుంటూ జీవితంలో ఎన్నో కష్ట సుఖాల్ని కలిసే ఎదుర్కొన్నామనీ, ఇప్పుడు ఈ బహుమతిని తాము పంచుకుంటున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. 34 ఏళ్ళ శరత్ పురుషోత్తమన్, 36 ఏళ్ళ ప్రశాంత్ సురేంద్రన్.. కేరళకు చెందినవారు. ఇద్దరూ ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. దుబాయ్లో ఈ ఇద్దరూ ఒకే రూమ్లో వున్నారు. కష్ట సుఖాల్లో ఇద్దరం కలిసే వున్నామనీ, ఒకరి అవసరాల్ని ఇంకొకరు తీర్చేందుకు కష్టపడ్డామని చెప్పారు. శరత్ పురుషోత్తమన్ పేరు మీద టిక్కెట్కి బహుమతి లభించింది. మొత్తం 15 మిలియన్ దిర్హామ్ల బహుమతి శరత్ని వరించింది. బహుమతి గెల్చుకున్న ఆనందంలో తన తల్లిని చూడాలని వుందంటున్నారు శరత్. మరోపక్క తన కుమార్తె తనకు లక్ అని ప్రశాంత్ అంటున్నారు. ఈ ఆనంద క్షణాల్లో తమ కుటుంబాలతో వుండాలని కోరుకుంటున్నామనీ, ఆ తర్వాతే ఈ బహుమతిని ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ