15 మిలియన్‌ దిర్హామ్‌ల విజేతలు ఈ బెస్ట్‌ ఫ్రెండ్స్‌

- January 04, 2019 , by Maagulf
15 మిలియన్‌ దిర్హామ్‌ల విజేతలు ఈ బెస్ట్‌ ఫ్రెండ్స్‌

యూ.ఏ.ఈ:ఇద్దరు స్నేహితులు.. కొత్త ఏడాదిలో అత్యద్భుతమైన బహుమతిని గెల్చుకున్నారు. ఈ ఆనంద క్షణాల్ని పంచుకుంటూ జీవితంలో ఎన్నో కష్ట సుఖాల్ని కలిసే ఎదుర్కొన్నామనీ, ఇప్పుడు ఈ బహుమతిని తాము పంచుకుంటున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. 34 ఏళ్ళ శరత్‌ పురుషోత్తమన్‌, 36 ఏళ్ళ ప్రశాంత్‌ సురేంద్రన్‌.. కేరళకు చెందినవారు. ఇద్దరూ ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. దుబాయ్‌లో ఈ ఇద్దరూ ఒకే రూమ్‌లో వున్నారు. కష్ట సుఖాల్లో ఇద్దరం కలిసే వున్నామనీ, ఒకరి అవసరాల్ని ఇంకొకరు తీర్చేందుకు కష్టపడ్డామని చెప్పారు. శరత్‌ పురుషోత్తమన్‌ పేరు మీద టిక్కెట్‌కి బహుమతి లభించింది. మొత్తం 15 మిలియన్‌ దిర్హామ్‌ల బహుమతి శరత్‌ని వరించింది. బహుమతి గెల్చుకున్న ఆనందంలో తన తల్లిని చూడాలని వుందంటున్నారు శరత్‌. మరోపక్క తన కుమార్తె తనకు లక్‌ అని ప్రశాంత్‌ అంటున్నారు. ఈ ఆనంద క్షణాల్లో తమ కుటుంబాలతో వుండాలని కోరుకుంటున్నామనీ, ఆ తర్వాతే ఈ బహుమతిని ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెబుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com