ఐర్లాండ్:సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన భారతీయ విద్యార్థి
- January 05, 2019ఐర్లాండ్:ఎత్తైన కొండ మీద నుంచి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఐర్లాండ్లోని క్లిఫ్స్ ఆఫ్ మోహర్ కొండ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన విద్యార్థి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. డబ్లిన్ యూనివర్సిటీలో సదరు యువకుడు విద్యనభ్యసిస్తోన్నట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా క్లిఫ్స్ ఆఫ్ మోహర్ నిలిచింది. ఎత్తైన కొండలు, పచ్చిక బయళ్లు, ఆహ్లాదకర వాతావరణ, పక్కనే సముద్రంతో అత్యంత సుందరమైన ప్రదేశంగా పేరుగాంచింది. ప్రకృతి సోయగాలను వీక్షించేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థి కొండ అంచున నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కాలు పట్టుతప్పడంతో కొండమీద నుంచి జారిపడి సముద్రంలో పడిపోయాడు.
విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. హెలికాప్టర్ సహాయంతో సముద్రంలో పడిపోయిన విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. చనిపోయిన విద్యార్థికి సుమారు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడి వివరాలను తెలుసుకొని కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..