గల్ఫ్ మరణాల గణాంకాలు...

- January 06, 2019 , by Maagulf
గల్ఫ్ మరణాల గణాంకాలు...

ఢిల్లీ:గల్ఫ్‌ దేశాల్లో భారత కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. 2014 నుంచి 2018 మధ్య గల్ఫ్‌ దేశాలైన బహ్రైన్‌, కువైట్‌, ఒమన్‌, కతర్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ)లలో 28,523 మంది భారత కార్మికులు మృతి చెందారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాటియాల ఎంపీ ధరమ్‌వీరా గాంధీ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి వికె సింగ్‌ సమాధానమిచ్చారు. ఆయా దేశాల్లోని భారత ఎంబసీల వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. భారత కార్మికులు అధికంగా మృతి చెందిన గల్ఫ్‌ దేశాల్లో సౌదీఅరేబియా ఉంది. ఇక్కడ 2014-18 మధ్య 12,828 మంది కార్మికులు మృతి చెందారు. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ(7,877 మంది) ఉన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com