చిలీలో కార్చిచ్చు...8 మంది మృతి
- January 06, 2019శాంటియాగో : దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తున్నది. మంటల్లో చిక్కుకొని 8 మంది మృతిచెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కార్చిచ్చు చెలరేగిన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వోల్పారైసో ప్రాంతంలో భారీ ఆస్తినష్టం సంభవించిందన్నారు. లిమాచే నగర మేయర్ కార్చిచ్చు వ్యాపించిన ప్రాంతాల్లో పర్యటించారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఓ హిగ్గిన్స్ దక్షిణ ప్రాంతంలోని 2600 హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని అన్నారు. అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన