బాలయ్యకు బ్రహ్మరథం పట్టిన నిమ్మకూరు వాసులు
- January 07, 2019సొంతూరు నిమ్మకూరులో బాలకృష్ణకి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం ఇవాళ నిమ్మకూరుకి విచ్చేసింది. ఎన్టీఆర్ వేషధారణలో పంచె కట్టుతో నిమ్మకూరు వచ్చిన బాలకృష్ణకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట బయోపిక్ లో నటించిన విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, డైరెక్టర్ క్రిష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి బాలయ్య నివాళులర్పించారు.
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాటిలో మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఈ నెల 9న విడుదలకానుంది. ఎన్టీఆర్ సినిమా విడుదల కాబోతున్న 100 థియేటర్లలో ప్రజల సందర్శనార్థం 100 ఎన్టీఆర్ విగ్రహాల్ని ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఆ వంద విగ్రహాల్లో మొదటి విగ్రహాన్ని ఇవాళ తిరుతిలోని పిజెఆర్ థియేటర్లో బాలయ్య, విద్యా బాలన్ ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..