హైదరాబాద్ లో 13 నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ
- January 08, 2019ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ వివరాలను సోమవారం సచివాలయంలో వెల్లడించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 దేశాలకు చెందిన 42 సంస్థల ప్రతినిధులు, 60 మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కైట్ ఫెస్టివల్తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో.. వెయ్యి రకాల వంటకాలు ప్రదర్శిస్తామన్నారు. ఆగాఖాన్ అకాడమీతో సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెంకటేశం తెలిపారు.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం