కుంభ్ మేళ: ఎన్ని ప్రత్యేకతలు సంతరించుకుందో మీరే చదవండి
- January 08, 2019ప్రయాగ్రాజ్: ఈ ఏడాది జరగబోయే కుంభమేళాకు ఉత్తర్ప్రదేశ్ సిద్ధమవుతున్నది. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుంభమేళా కోసం రూ.2800 కోట్లు కేటాయించడం విశేషం. కుంభమేళా నిర్వహణకు మొత్తం రూ.4300 కోట్లు ఖర్చు కానుండగా.. మిగిలిన మొత్తం ఇతర నిధుల రూపంలో అందనున్నాయి. ఈ కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ పక్కనే ఓ తాత్కాలిక నగరాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన తాత్కాలిక నగరం కావడం విశేషం. ఈ నగరంలో 250 కిలోమీటర్ల మేర రోడ్లు, 22 పాంటూన్ బ్రిడ్జీలు నిర్మించారు. 40 వేల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లు కూడా భారీగానే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. రూ.247 కోట్లతో ప్రయాగ్రాజ్లో రెండు కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రూ.116 కోట్లతో చేపట్టిన ఓ సెంటర్ పూర్తయింది. మొత్తం 20 వేల మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. ఈ పోలీసులెవరికీ మందు తాగే అలవాటు లేదు. పైగా అందరూ కేవలం శాకాహారం మాత్రం తింటారని యూపీ డిఐజీ కేపీ సింగ్ వెల్లడించారు. జనవరి 15 నుంచి మొదలయ్యే ఈ కుంభమేళాకు సుమారు 12 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 192 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా రానున్నారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ