స్వల్ప సాంకేతిక సమస్యతో దుబాయ్‌ మెట్రో సేవలకు అంతరాయం

- January 08, 2019 , by Maagulf
స్వల్ప సాంకేతిక సమస్యతో దుబాయ్‌ మెట్రో సేవలకు అంతరాయం

అల్‌ రషిద్యా స్టేషన్‌ మరియు యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ స్టేషన్‌ మధ్య చిన్న సాంకేతిక సమస్య కారణంగా మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ పేర్కొంది. దుబాయ్‌ మెట్రోకి చెందిన రెడ్‌ మరియు గ్రీన్‌లైన్స్‌కి సంబంధించి యూనియన్‌ స్టేషన్‌ వద్ద నాలుగు నిమిషాల ఆలస్యం చోటు చేసుకుంది. దాంతో బుర్‌జుమన్‌ స్టేషన్‌ మరియు ఎడిసిబి స్టేషన్‌ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం పీక్‌ టైమ్‌లో ఈ సమస్య రావడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఇతర స్టేషన్లలో సమస్యలేమీ తలెత్తలేదని ఆర్‌టిఎ పేర్కొంది. చిన్న సమస్య కారణంగా లాంగ్‌ డిలేస్‌ ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణీకులు వాల్పోయారు. అల్‌ రషిదియా మరియు యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ వద్ద ట్రైన్స్‌ని రెడ్‌ లైన్‌ మీద ఆపివేసినట్లు ప్రయాణీకులు సోషల్‌ మీడియాలో తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com