ఇల్లీగల్‌ ఎంట్రీ: 64 మైగ్రెంట్స్‌ డిపోర్టేషన్‌

- January 09, 2019 , by Maagulf
ఇల్లీగల్‌ ఎంట్రీ: 64 మైగ్రెంట్స్‌ డిపోర్టేషన్‌

మస్కట్‌: మొత్తం 64 మంది మైగ్రెంట్స్‌ని డిపోర్ట్‌ చేయడం జరిగింది. అక్రమంగా వీరు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. డిపోర్టేషన్‌కి గురైనవారంతా ఆసియా జాతీయులే. మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా వీరిని డిపోర్టేషన్‌ చేయడం జరిగింది. అయితే, ఏ దేశానికి చెందినవారిని డిపోర్టేషన్‌ చేశారన్నదానిపై స్పష్టత లేదు. జ్యుడీషియల్‌ అథారిటీస్‌, వీరిని అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు గుర్తించి, డిపోర్టేషన్‌ చేయాల్సిందిగా ఆదేశించడంతో డిపోర్టేషన్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com