పోలీస్ అధికారులపై దాడి: ఇద్దరు హౌస్ మెయిడ్స్కి జైలు
- January 10, 2019హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు హౌస్మెయిడ్స్కి ఏడాది జైలు శిక్ష విధించింది. మహిళా పోలీస్ అధికారిపై ఈ ఇద్దరు మహిళలు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. న్యాయస్థానం ఈ మేరకు నిందితులకు జైలు శిక్ష విధించడం జరిగింది. నిందితుల్లో ఒకరు ఆసియాకి చెందిన వ్యక్తి కాగా మరొకరు, ఇథియోపియాకి చెందిన వ్యక్తి. రెసిడెన్స్ స్టేటస్పై విచారణ చేస్తుండగా మహిళా అధికారిపై వీరు దాడి చేశారు. ఇద్దరూ అక్రమంగా కింగ్డమ్లో నివసిస్తున్నారు. ఇథియోపియన్ మహిళ ఓ అధికారపై దాడి చేయగా, ఆసియాకి చెందిన మరో మహిళ, ఇతర మహిళా అధికారులపై దాడికి దిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. నిందితులు, బాధిత మహిళా అధికారిని, ఇతర అధికారుల్ని దుర్భాషలాడారు. నిందితులకు జైలు శిక్ష అనంతరం, వారిని డిపోర్టేషన్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం