ఇప్పటివరకు చూడని చంద్రుని ఫొటో పంపిన చైనా స్పేస్క్రాఫ్ట్
- January 11, 2019మనం ఇప్పటివరకు చూడని చంద్రుని ఫొటోను పంపించింది చైనాకు చెందిన చాంగె-4 స్పేస్క్రాఫ్ట్. చరిత్రలో తొలిసారి జనవరి 3న చంద్రుని అవతలి వైపు మనిషి పంపిన స్పేస్క్రాఫ్ట్ ల్యాండైన విషయం తెలిసిందే. యుటూ 2 అనే రోవర్ ల్యాండర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. గురువారమే అది చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లింది. చాలంగె-4లోని కెమెరా చంద్రుడి పనోరమిక్ ఫొటోను తీసి భూమికి పంపించింది. దీనిని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫొటోలో చంద్రుడితోపాటు ల్యాండర్, రోవర్ కూడా కనిపిస్తున్నాయి. ల్యాండింగ్ సైట్లో చంద్రుడి ఉపరితలానికి సంబంధించి సైంటిస్టులు ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ కూడా జరిపినట్లు చైనా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతా తమ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు వివరించింది. ఐదు రోజుల పాటు స్టాండ్ బై మోడ్లో ఉన్న 140 కిలోల రోవర్.. గురువారం నుంచే పని మొదలుపెట్టింది. చంద్రుడి గురించి ఇప్పటివరకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి చంద్రుడి చీకటి భాగమే కీలకమని సైంటిస్టులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..