కొత్త విమానాల్ని ప్రకటించిన ఇండియన్ ఎయిర్లైన్
- January 12, 2019మస్కట్: ఇండియాకి చెందిన బడ్జెట్ ఎయిర్లైన్ గో ఎయిర్, వారంలో ఏడు విమానాలు నడిపే దిశగా కొత్త ప్రకటనను విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేరళలోని కన్నుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ విమానాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని ఒమన్ - పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఏ) పేర్కొంది. గో ఎయిర్ ఆపరేషన్కి సంబంధించి అనుమతులు మంజూరు చేసినట్లు పిఎసిఎ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. లో కాస్ట్ ఇంటర్నేషనల్ కెరియర్ అయిన గో ఎయిర్, ముంబై కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఇండియాలో ఐదో అతి పెద్ద ఎయిర్లైన్గా 2017లో గో ఎయిర్ గుర్తింపు తెచ్చుకుంది. ఇంకో వైపు కేరళలో ఐదవ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్నుర్ పేరుగాంచింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ