భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది--వెంకయ్యనాయుడు
- January 12, 2019భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని వెంకయ్యనాయుడు యువతకు దిశానిర్ధేశం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్టు దగ్గర జరిగిన స్వామి వివేకానంద ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువత పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని 120 ఏళ్ల కిందటే స్వామి వివేకనంద స్వామి అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు..
స్వర్ణభారత్ ట్రస్ట్ విద్యార్థులతో ముఖాముఖిలో వెంకయ్యనాయుడు కాసేపు మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడి క్యాంటీన్ను స్వయంగా పరిశీలించి భోజన వసతిపై ఆరా తీశారు..
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA