తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కనుమ పండుగ

- January 16, 2019 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కనుమ పండుగ

తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటున్నారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు.. అందులోకి నాటుకోడితోపాటు వివిధ రకాల మాంసాహారాలు తీసుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజులూ మూడు ప్రత్యేకతలు సంతరించుకుంది. తొలిరోజు భోగి మంటలు వేసి పిండి వంటలు చేసుకుని పిల్లలు ఆనందంగా గడుపుతారు. రెండో రోజున తమ పూర్వీకులకు పితృతర్పణాలు ఇచ్చే కార్యక్రమాలు పెద్దలు పెట్టుకుంటారు. మూడో రోజు పూర్తిగా మాంసాహారం సంక్రాంతిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో బాగంగా ఇవాళ కనుమ కావడంతో ప్రజలు మాంసాహారం షాపుల ముందు క్యూకట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com