తేజు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
- January 16, 2019సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ .. రితిక సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కథానాయికలలో ఒకరి పేరు 'చిత్ర' .. మరొకరి పేరు 'లహరి' అయ్యుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ టైటిల్లోని అయిదు అక్షరాలలో, ఒక్కో అక్షరంతో మొదలయ్యే ఒక్కో పేరుతో అయిదు ముఖ్యమైన పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్