మస్కట్లో న్యూ ఇండియన్ స్కూల్ త్వరలో ప్రారంభం
- January 16, 2019మస్కట్: ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ - బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఇండియన్ స్కూల్ బౌషర్ హేండోవర్ కార్యక్రమం జరిగింది. క్యాపిటల్ ఏరియాలో ఇది ఏడవ ఇండియన్ స్కూల్ కాగా, ఒమన్ సుల్తానేట్లో మొత్తంగా ఇది 21వది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్కూల్ మెరుగైన విద్యను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్ సామ్యుయేల్ మాట్లాడుతూ, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని ఈ స్కూల్లో అందిస్తున్నట్లు తెలిపారు. స్విమ్మింగ్, స్ప్లాష్ పూల్స్, వెల్నెస్ సెంటర్, వరల్డ్ స్టాండర్డ్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, సైకిలింగ్ ట్రాక్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ కోర్ట్, క్రికెట్ పిచ్చ, కబడ్డి ప్లే ఏరియా వంటి సౌకర్యాలు ఈ స్కూల్లో ఏర్పాటు చేశారు. అత్యున్నత లైబ్రరీలు, మోడ్రన్ ఎమినిటీస్, మ్యూజిక్ రూమ్, రిసోర్స్ సెంటర్, స్టెమ్ లేబరేటరీస్, రోబోటిక్స్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ లెర్నింగ్, కిండర్గార్టెన్ ప్లే ఏరియా కూడా వున్నాయిక్కడ.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు