‘శ్రీదేవి బంగ్లా’లో అసలేం జరుగుతోంది: ఎందుకు బోనీ కపూర్ ఫైర్!!
- January 17, 2019ఆమె టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్లోకి అడుగు పెట్టింది అక్కడ కూడా తన మార్క్ చూపించి నెంబర్ వన్ హీరోయిన్గా వెలిగింది శ్రీదేవి. కానీ అర్థాంతరంగా బాత్టబ్లో పడిపోయి మరణించినట్లు వార్త. అభిమానులు ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోయారు. అందాల తార మరణంపై ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అభిమానుల్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్ కన్నుగీటి తను నటించిన మొదటి చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెతో బాలీవు్ దర్శక నిర్మాతలు ఓ సినిమా మొదలు పెట్టారు. ఆ చిత్రానికి శ్రీదేవి బంగ్లా అని టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై పెద్ద చర్చకు దారి తీసింది.
టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రియా ప్రకాష్ ఈ చిత్రంలో ఓ స్లార్ హీరోయిన్. ఆమె జీవితంలో ఒడిదుడుకులు, బాధలు, మద్యానికి బానిస కావడం ఇలాంటి అనేక ఆసక్తికర అంశాల తరువాత చివర్లో బాత్ టబ్లో పడిపోయినట్లుగా కాళ్లు మాత్రమే కనిపించే సీన్స్తో టీజర్ ముగించారు చిత్ర యూనిట్. అయితే ఈ టీజర్ తన భార్య శ్రీదేవి చివరి మజిలీకి దగ్గరగా ఉన్నాయని భావించిన బోనీ కపూర్ ఈ చిత్రంపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపించారు.
ఆ సినిమాలో ఏముందో ముందు తనకు చూపించిన తరువాతే సినిమాను విడుదలచేయాలని బోనీ నోటీసు సారాంశం. దానికి శ్రీదేవి బంగ్లా దర్శకుడు వివరణ ఇచ్చుకుంటూ హీరోయిన్గా మారిన శ్రీదేవి అనే ఓ యువతి కథతో ఈ సినిమా తీశామని అంతకు మించి ఏమీ లేదని చెబుతున్నారు. చిత్ర యూనిట్ కూడా సినిమాకు సంబంధించి ఏ విషయం క్లారిటీగా చెప్పడం లేదన్నది మాత్రం నిర్వివాదాంశం.
సెన్సేషన్ గా మారిన శ్రీదేవి బంగ్లా తర్వాత ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ప్రియా ప్రకాష్ తాను నటించిన రెండో చిత్రంతో కూడా విడుదలకు ముందే ఓ సెన్సేషన్ని క్రియేట్ చేయబోతోంది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి