'భీష్మ' .. సింగిల్ ఫరెవర్!

- January 17, 2019 , by Maagulf
'భీష్మ' .. సింగిల్ ఫరెవర్!

నితిన్ కథానాయకుడిగా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల వినిపించిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను .. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. 'ఛలో' హిట్ తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమా, నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com