'భీష్మ' .. సింగిల్ ఫరెవర్!
- January 17, 2019నితిన్ కథానాయకుడిగా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల వినిపించిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను .. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. 'ఛలో' హిట్ తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమా, నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..