షార్జాలో వ్యక్తి హత్య

- January 17, 2019 , by Maagulf
షార్జాలో వ్యక్తి హత్య

46 ఏళ్ళ సుడానీ వ్యక్తి హత్యకు గురి కాగా 33 ఏళ్ళ భారతీయ మహిళ, ఆమె కుమార్తె తీవ్రంగా ఘాయపడిన ఘటన షార్జాలో జరిగింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. షార్జాలోని అల్‌ బుతినా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకోగానే సీఐడీ, ఫోరెన్సిక్‌ ఆఫీసర్స్‌ మరియు పెట్రోల్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఓ మహిళ, ఆమె కుమార్తె అలాగే ఓ సుడానీ వ్యక్తి కన్పించారు. మరో సుడానీ వ్యక్తి చేతిలో కత్తితో పోలీసులకు చిక్కాడు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలోనే సుడానీ వ్యక్తి చనిపోగా, గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మహిళకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com