ప్రాణం తీసిన నిద్ర మత్తు

- January 17, 2019 , by Maagulf
ప్రాణం తీసిన నిద్ర మత్తు

26 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు ధయిద్‌ నుంచి షార్జాకి వెళుతుండగా బ్రిడ్జి నెంబర్‌ 10 వద్ద తన కారు ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఆ యువకుడికి నిద్ర ముంచుకు రావడంతో నిద్ర మత్తులో కారుని కంట్రోల్‌ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కారు అతి వేగంతో దూసుకుపోతోంది. ఈ కారణంగా పలు మార్లు కారు గాల్లోకి ఎగిరి, ఫ్లిప్‌ అయినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినా అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో ప్రయాణించాలని అధికారులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com