పోలీసు అకాడమీ ముందు పేలిన కారు బాంబు, 21 మంది మృతి

- January 18, 2019 , by Maagulf
పోలీసు అకాడమీ ముందు పేలిన కారు బాంబు, 21 మంది మృతి

కొలంబియాలో పోలీసు అకాడమీ ముందు కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో 68 మంది గాయపడ్డారు. పేలుడుతో బొగట నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసు అకాడమీ దగ్గర ఉన్న బిల్డింగ్‌లు పేలుడు ప్రభావానికి లోనయ్యాయి. రూఫ్‌టాప్‌ల టైల్స్ ఎగిరిపోయాయి. ఉగ్రదాడి వల్ల మృతిచెందిన పోలీసులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు బొగట మేయర్ తన ట్వీట్‌లో తెలిపారు. డ్రగ్ ట్రాఫికర్స్‌, లెఫ్టిస్ట్ గెరిల్లాల మధ్య తరుచూ కొలంబియాలో కారు బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజా పేలుడుకు మాత్రం ఇంత వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com