బ్యాగేజీ అలవెన్స్‌పై మేజర్‌ ఛేంజ్‌ని ప్రకటించిన ఎమిరేట్స్‌

- January 21, 2019 , by Maagulf
బ్యాగేజీ అలవెన్స్‌పై మేజర్‌ ఛేంజ్‌ని ప్రకటించిన ఎమిరేట్స్‌

దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌, తమ బ్యాగేజీ అలవెన్స్‌ పాలసీపై మార్పుని ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ఎమిరేట్స్‌ సర్కులర్‌ ప్రకారం, పలు బ్యాగేజీ అలవెన్స్‌కి సంబంధించి తగ్గుదల కన్పిస్తోంది. అలాగే ఎకానమీ ఫ్లయర్స్‌ కోసం ఉచిత బ్యాగేజీ అలవెన్స్‌ స్కీమ్‌ని కూడా ప్రకటించింది. స్పెషల్‌, సేవర్‌, ఫ్లెక్స్‌ మరియు ఫ్లెక్స్‌ ప్లస్‌ టిక్కెట్‌ విభాగాలుగా ఎకానమీ ఫేర్స్‌ని విభజించింది ఎమిరేట్స్‌ ఇటీవలే. ఫిబ్రవరి 4 నుంచి స్పెషల్‌ మరియు సేవర్‌ టికెట్‌ హోల్డర్స్‌ ఇకపై 15 అలాగే 25 కిలోల బ్యాగేజీ అలవెన్స్‌ని పొందుతారు. మామూలుగా అయితే ఈ టిక్కెట్లు 20 అలాగే 30 కిలోల బ్యాగేజీ అలవెన్స్‌ పొంది వున్నారు. ఫిబ్రవరి 4 కంటే ముందు టిక్కెట్లు పొందినవారికి మాత్రం పాత బ్యాగేజీ అలవెన్స్‌ స్కీమ్‌ కొనసాగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com