మమ్ముట్టితో తొలిసారి సన్నీలియోన్
- January 29, 2019హాట్ బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్ కంటే సౌత్పై ఎక్కువగా ఫోకస్ చేసిందా? అవుననే అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. మోలీవుడ్లో ఈమెకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవల ఓ మొబైల్ షాపు ఓపెనింగ్కి కేరళకు వెళ్లిన సన్నీని చూసేందుకు యూత్ ఓ రేంజ్లో ఎగబడింది. దీన్ని గమనించిన కొందరు ప్రొడ్యూసర్లు.. ఆమె క్రేజ్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో మమ్ముట్టితో 'మధుర రాజా' సినిమా మొదలుపెట్టేశారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సన్నీలియోన్ స్పెషల్సాంగ్ చేస్తోంది. మమ్ముటితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది సన్నీ. ఈ సాంగ్ మూవీకే హైలైట్ అని చెబుతోంది యూనిట్. అందుకు సంబంధించిన పిక్ సోషల్మీడియాలో వైరల్గా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఫిల్మ్ని ఏప్రిల్లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. వైశాఖ్ డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్లో తమిళ నటుడు జై, జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట