మార్చిలో ‘సీతారామరాజు - ఎ ట్రూ వారియర్’ ప్రారంభం

- January 29, 2019 , by Maagulf
మార్చిలో ‘సీతారామరాజు - ఎ ట్రూ వారియర్’ ప్రారంభం

మన్యంలో బ్రిటీష్ వారి దురాగతాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగురవేసిన పాతికేళ్ల కుర్రాడు అల్లూరి సీతారామరాజు జీవిత గాథను ‘సీతారామరాజు’ పేరుతో తెరకెక్కించనున్నారు. ‘ఎ ట్రూ వారియర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. సొంతూరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో.. డా. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.... 'అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా ‘‘సీతారామరాజ’ - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వసతులతో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ స్టూడియో అండ్ అకాడమీ బ్యానర్‌పై ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీ ల పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది.
 
నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు కూడా ఇందులో నటిస్తారు. మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ వర్క్‌కు సంబంధించిన సీజీ వర్క్ ఇప్పటికే జరుగుతోంది. చరిత్రకారుల సహకారంతో సీతారామరాజు మరణానికి సంబంధించిన మిస్టరీని కూడా ఈ చిత్రంలో చూపించనున్నాం. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తాం’ అని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com