యాత్ర మొదటి టికెట్ వేలం. కళ్లు చెదిరే రేటు.
- February 04, 2019వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యే ప్రీ రిలీజ్ వేడుకను కూడా సినిమా జరుపుకుంది. యాత్ర సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ను అమెరికాలోని సీటెల్లో వేలం వేశారు.
భారీ ధరకు మొదటి టికెట్ అమ్ముడుపోయింది. పలువురు అభిమానులు మొదటి టికెట్ను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. మునీశ్వర్ అనే ఎన్ఆర్ఐ మొదటి టికెట్ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నారు. మన కరెన్సీలో 4. 37లక్షలకు టికెట్ అమ్ముడుపోయింది.
టికెట్ అసలు ధర 12 డాలర్లు. మిగిలిన సొమ్మును వైఎస్ఆర్ ఫౌండేషన్ను విరాళంగా ఇస్తున్నట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్