యాత్ర మొదటి టికెట్‌ వేలం. కళ్లు చెదిరే రేటు.

- February 04, 2019 , by Maagulf
యాత్ర మొదటి టికెట్‌ వేలం. కళ్లు చెదిరే రేటు.

వైఎస్‌ఆర్‌ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యే ప్రీ రిలీజ్‌ వేడుకను కూడా సినిమా జరుపుకుంది. యాత్ర సినిమాకు సంబంధించిన మొదటి టికెట్‌ను అమెరికాలోని సీటెల్‌లో వేలం వేశారు.

భారీ ధరకు మొదటి టికెట్‌ అమ్ముడుపోయింది. పలువురు అభిమానులు మొదటి టికెట్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. మునీశ్వర్‌ అనే ఎన్‌ఆర్‌ఐ మొదటి టికెట్‌ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నారు. మన కరెన్సీలో 4. 37లక్షలకు టికెట్‌ అమ్ముడుపోయింది.

టికెట్‌ అసలు ధర 12 డాలర్లు. మిగిలిన సొమ్మును వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ను విరాళంగా ఇస్తున్నట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్‌ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com