ఢిల్లీ లో ముగిసిన చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

- February 11, 2019 , by Maagulf
ఢిల్లీ లో ముగిసిన చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

ఢిల్లీ:ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగిసింది. విభజన హామీలు నెరవేర్చాలంటూ దిల్లీలో తెదేపా అధినేత ఈ దీక్ష చేపట్టారు. మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. వివిధ జాతీయ పార్టీల నేతలు వచ్చి చంద్రబాబు దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించారు.ఈ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు దీక్ష కొనసాగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ములాయం సింగ్‌ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తదితరులు ధర్మపోరాట దీక్ష మద్దతు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com