తెలంగాణ:ఆన్లైన్లోనే మ్యారేజ్ ముస్లీం సర్టిఫికెట్
- February 11, 2019హైదరాబాద్: ముస్లిములు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వక్ఫ్బోర్డు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధంగా ఈ-ఖజ్జత్(ఆన్లైన్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ రోజు వక్ఫ్బోర్డు కార్యాలయంలో ఆన్లైన్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు విధానాన్ని మహమూద్ అలీ, వక్ఫ్బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ సలీం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని, ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ-ఖజ్జత్ విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం వక్ఫ్బోర్డు కార్యాలయానికి వచ్చే వారని, ఇప్పుడు ఆ సమస్య తలెత్తదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, గడువు తేదీన కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. WAQF.TELANGANA.GOV.IN వెబ్సైట్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ