మహేష్ బాబుకు అరుదైన గౌరవం..
- February 15, 2019తెలుగు సూపర్స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుంది. గత ఏప్రిల్లో మహేష్ బాబు మైనపు బొమ్మను తయారు చేస్తున్నట్లు ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లే ఆ మైనపు బొమ్మ తయారీ పూర్తిచేసింది. మలేషియాలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతి త్వరలో మహేష్ బాబు మైనపు ప్రతిమ కొలువుదీరనుంది. ఈలోగా ఆ మైనపు ప్రతిమను హైదరాబాద్లో ఒకరోజు ప్రదర్శించాలని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఇలా ఒక నటుడి మైనపు ప్రతిమను సొంత నగరంలో అభిమానుల మధ్య ప్రదర్శించడం మేడమ్ టుస్సాడ్స్ సంస్థకు ఇదే తొలిసారి. ఈ విధంగా మహేష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఏప్రిల్లో మహర్షి ఘనంగా విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!