లండన్‌: పాక్ హైకమిషన్ ఆఫీసు ఎదుట భారతీయుల నిరసన

- February 17, 2019 , by Maagulf
లండన్‌: పాక్ హైకమిషన్ ఆఫీసు ఎదుట భారతీయుల నిరసన

బ్రిటన్: లండన్ మహానగరం నిరసనలతో మారుమ్రోగింది. జమ్ముకశ్మీర్ పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా బ్రిటన్ భారతీయులు రోడ్డెక్కారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లండన్‌లో పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొందరు మౌన ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎక్కువ మంది తెలుగువారు పాల్గొనడం విశేషం.భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com