850 మంది భారత ఖైదీల విడుదలకు సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ ఆదేశాలు

- February 21, 2019 , by Maagulf
850 మంది భారత ఖైదీల విడుదలకు సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ ఆదేశాలు

భారతదేశంలో పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అందులో సౌదీ జైళ్ళలో మగ్గుతోన్న భారత ఖైదీలను విడుదల చేయడం ఒకటి కాగా, మరొకటి భారత యాత్రీకులకు హజ్‌ కోటా పెంచడం. ఇండియా మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ అధికార ప్రతినిథి రవీష్‌ కుమార్‌ ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ, సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌, 850 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. హజ్‌ కోటాను 200,000కు పెంచుతూ క్రౌన్‌ ప్రిన్స్‌ ఆదేశించారని, ప్రధాని నరేంద్రమోడీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు రవీష్‌ కుమార్‌. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com