జమ్మూకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం..కశ్మీర్ రాజకీయ నేతల భద్రతా సిబ్బంది ఉపసంహరణ

- February 21, 2019 , by Maagulf
జమ్మూకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం..కశ్మీర్ రాజకీయ నేతల భద్రతా సిబ్బంది ఉపసంహరణ

శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 155 మంది రాజకీయ నాయకులకు భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ గవర్నరు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులకు భద్రత అవసరం లేదని సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఐఏఎస్ అధికారిగా ఉండి ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైజల్ కు ఉన్న సెక్యూరిటీని సైతం హోంశాఖ అధికారులు తొలగించారు. దీంతో వెయ్యిమంది పోలీసులతోపాటు వంద వాహనాలు పోలీసు శాఖకు తిరిగివచ్చాయి. వీటిని పోలీసు పహరాకు వినియోగించాలని నిర్ణయించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్న కశ్మీర్ ప్రత్యేక వాదులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖమంత్రి హెచ్చరించారు. రాజకీయ నాయకులతో పాటు 18 మంది హురియత్ నేతలు, ఎస్ఎఎస్ గీలానీ, అబ్దుల్ ఘనీ షా, యాసీన్ మాలిక్, మమ్మద్ ముసాదిఖ్ భట్ ల భద్రతా సిబ్బందిని ఉపసంహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com