ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమానం

- February 21, 2019 , by Maagulf
ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమానం

టెక్నాలజీ ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతోంది. క్రియేటివ్‌గా ఆలోచించే వారికి ఓ అవకాశం అంటూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో మీరూ పాల్గొనే అవకాశం ఉంది. గెలిస్తే అదృష్టం అయిదు లక్షల రూపంలో మిమ్మల్ని వరిస్తుంది.

 
దీనికి మీరు చేయవలసిందల్లా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మాత్రమే కాకుండా కాస్త క్రియేటివ్‌గా ట్వీట్ చేయాలి. ఇది ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. మీ మెసేజ్‌ని #StopThinkAct అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

బ్యాంకు మోసాలు, బ్యాంకింగ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్లు, ఆన్‌లైన్ మోసాలపై మీ మెసేజ్ ఉండాలి. అయితే ఇది టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కానక్కరలేదు, ఫొటోలు, వీడియోలు, ఏవైనా పంపించొచ్చు. కానీ క్రియేటివ్‌గా ఉండాలనే విషయం మాత్రం మర్చిపోకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com