ఆర్మీ 'మేజర్ 'గా అడవిశేషు..నిర్మాతగా మెష్ బాబు
- February 28, 2019టాలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్న అడవిశేషు..ఇటీవల గూఢచారి సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ తరహా సినిమా రావడంతో ఆడియన్స్ కొత్తగా ఫీల్ కావడం..సినిమా మంచి హిట్ అయ్యేందుకు దోహదపడింది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే ఉత్తమ సినిమాగా నిలిచింది. ఈ సారి 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అడవి శేషు.
26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్స్పిరేషన్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కూడా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అడివి ఎంటర్ టైన్ మెంట్, శరత్ చంద్ర, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమా రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. 2020లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ అడవిశేషు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పోస్టర్ చూస్తుంటే మరో హిట్ కొట్టేలా ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..