దిల్ రాజు బ్యానర్లో మళ్లీ రాజ్ తరుణ్

- March 05, 2019 , by Maagulf
దిల్ రాజు బ్యానర్లో మళ్లీ రాజ్ తరుణ్

వరుస అవకాశాలతో .. వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ కథానాయకులలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే క్రితం ఏడాది ఆయనను వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన దిల్ రాజు ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్లో 'లవర్' తో పరాజయాన్ని చవిచూసిన రాజ్ తరుణ్, మళ్లీ అదే బ్యానర్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. 'ఆడు మగాడ్రా బుజ్జి' ఫేమ్ కృష్ణారెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి 'నీది నాది ఒకటే లోకం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com