ఎల్ఐసీ నుంచి ఆమ్ ఆద్మీ బీమా యోజన.. సంవత్సరానికి రూ.200లు కడితే..
- March 09, 2019ఆమ్ ఆద్మీ బీమా యోజన స్కీమ్ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ స్కీమ్ అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించిన పథకం ఇది. అంటే శాలరీ బేస్డ్ కాని కార్మికులు.
18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు ఈ పథకంలో చేరవచ్చు.
ఈ స్కీమ్లో చేరాలంటే.. ఏజ్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు, బర్త్ రిజిస్టర్లో నమోదైన రికార్డు, స్కూల్ సర్టిఫికెట్, ఓటర్ లిస్ట్, ప్రభుత్వ శాఖ లేదా ప్రముఖ సంస్థ జారీ చేసిన ఐడీ కార్డు, ఆధార్ కార్డు ఏదైనా ఒకటి ఉండాలి.
కుటుంబంలో ఒకరే సంపాదిస్తున్న భూమి లేని నిరుపేదలు, వివిధ వృత్తులు చేసుకునేవారు అర్హులు.
ఈ పథకంలో చేరిన వారు వార్షికంగా రూ.200 ప్రీమియం చెల్లించాలి.
సహజంగా మరణిస్తే రూ.30,000
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75,000
శాశ్వత వైకల్యం, లేదా రెండు అవయవాలు కోల్పోయిన వారికి రూ.75,000 లేదా ఒక అవయవం కోల్పోయిన వారికి రూ.37,000 బీమా ఇస్తారు.
ఆమ్ ఆద్మీ అదనపు ప్రయోజనాలు..
స్కీమ్ పాల్గొన్న సభ్యుల ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12 మధ్యలో చదువుతున్న వారికి ప్రతినెలా ఎల్ఐసీ నుంచి ఒక్కొక్కరికి రూ.100లు అందుతుంది. ఆరు నెలలకోసారి స్కాలర్ షిప్ రూపంలో మరికొంత మొత్తం చెల్లించబడుతుంది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA