40 కిలోల డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

- March 09, 2019 , by Maagulf
40 కిలోల డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

అబుదాబీ పోలీసులు 40 కిలోల క్రిస్టల్‌ మెత్‌ని పార్క్‌ చేసి వున్న పాత కారులో గుర్తించారు. ముసఫ్ఫా ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసినవారిలో ఒకర్ని 'ది స్కార్పియన్‌'గా గుర్తించారు. డ్రగ్‌ కంట్రోల్‌ సెక్షన్‌ డైరెక్టరేట్‌ హెడ్‌ కల్నల్‌ తాహెర్‌ ఘరీబ్‌ అల్‌ దహ్రి మాట్లాడుతూ, విశ్వసనీయ వర్గాల సమాచారంతో సోదాలు నిర్వహించగా, నిందితులు వారితోపాటు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోగలిగామని చెప్పారు. క్రిస్టల్‌ మెత్‌ని పెద్ద మొత్తంలో తీసుకు వచ్చి, దాన్ని చిన్న చిన్న ప్యాక్టెలలో నింపి సరఫరా చేస్తుంటారని పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com