బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తాం:రాహుల్
- March 09, 2019తెలంగాణ:తాము అధికారంలో రాగానే ప్రతి పేదలకు కనీస ఆదాయం వచ్చేలా పథకం అమలు చేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ నీరవ్ మోదీ లాంటి వారి అకౌంట్లో డబ్బులు వేస్తే…తాము పేదల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని అన్నారాయన. దేశంలోని ఏ ఒక్క పేదవాడిని వదలకుండా కనీసం ఆదాయం వచ్చేలా పథకం రూపొందిస్తామన్నారు. శంషాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న రాహుల్..తమ పార్టీ పేదల కోసం పోరాడుతుందని అన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమై పోయిందన్నారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి రాగానే జీఎస్టీని ఒకే శ్లాబులో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ చేతిలో రిమోట్ లా మారారని ఆరోపించారు రాహుల్ గాంధీ. చైనా సైన్యం డోక్లాం సరిహద్దు దాటితే..మోదీ చైనా అధ్యక్షుడితో ఊయ్యాల ఊగారని గుర్తు చేశారు. పుల్వామా దాడి సమయంలో సినిమా తీయించుకుంటున్నారని విమర్శించారు. మోదీది దొంగదేశభక్తి అంటూ ఫైర్ అయ్యారు రాహుల్. దేశసంపదను 15 మందికి దోచి పెట్టారని ఆరోపించారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు